గత వారం అర్జెంట్గా ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళవలిసి వచ్చింది.చాలా సంవత్సరాల తరువాత మన ఎర్ర బస్సు కూడా ఎక్కడం జరిగింది.అలా అనుకోకుండా ఒక సారి ఎర్ర బస్సు ఎక్కినప్పుడు జరిగినది అందరి తో పంచుకుందామనుకున్నాను. అయితే రవిచంద్ర గారి అంతర్వాహిణి లో కూడా ఇదే విషయం గురించి ఆయన చర్చించడంతో ఈ టపా అవసరం లేదు అనుకున్నా!కాని ఒక కామెంట్ గా నా ఆలోచనలు అన్ని చెప్పడం కూడా కుదరక మనసు మార్చుకున్నాను.వైజాగ్ లో నాన్స్టాపు బస్సు ఎక్కి శ్రీకాకుళం వెళ్ళవలిసిన పని పడింది.అప్పటికే కొంచెం లేట్ కూడా అయిపోయింది.రాత్రి 8 గంటలకి బయలు దేరాము.రెండు గంటల ప్రయాణం!లేట్ అయితే హోటల్లు కూడా కట్టేస్తారు అని నన్ను నేనే తిట్టుకోవలిసిన పరిస్థితి.బస్సు మంచి స్పీడు మీద వుండడంతో ఆలోచనలు కట్టి పెట్టి కునుకు మొదలెట్టా. హఠాత్తుగా ధడ్ ధుడ్ మంటు శబ్దాలు.కునుకు మత్తు కళ్ళగప్పి పోయింది.ఏమయ్యిందో కాసేపటి వరకు తెలియలేదు.ఆ కాసేపటి తరువాత కూడా తెలిసినది సగం సగం!మా బస్సు లారిని గుద్దిందో లేక లారి నే మా బస్సు ని గుద్దిందో గాని,ఒక చిన్న పాటి యాక్సిడెంట్ అయ్యింది.
మా బస్సు డ్రైవరు ఒక చిన్నపాటి చేజింగ్ చేసి ఆగకుండా వెళ్ళిపోయిన లారిని పట్టుకున్నాడు.పెద్దపాటి గొడవ వేసుకున్నాడు ఆ లారి డ్రైవరు తో!లారి డ్రైవరు మటుకు ఏమి పట్టించుకోకుండా డాబాకి వెళ్ళి భోజనం చెయ్యడం మెదలెట్టాడు.మధ్యలో పాసింజర్లంతా వెర్రి మోహాలు వేసుకుని చూస్తున్నాము మా పరిస్థితి ఏంటి అని?ముందు లారి డ్రైవరిని ఆడిపోసుకున్నాము మా వాడితో కైలిసి,తరువాత నెమ్మదిగా మా పరిస్థితి ఏంటని అడిగాము వాడిని.”డిపో కి ఫోను చెయ్యాలి,ఎవరైనా వచ్చి కంప్లయింటు రాసుకుని పోలిసు రిపోర్టు రాసుకున్నాకా బస్సు కదులుతుంది” అన్నాడు. సరెలెమ్మని అందరు ఫోన్లు తీసిచ్చారు,తొందరగా అక్కడ నుండీ బయట పడుదామని.ట్విస్టు ఏమిటంటే వాడికి డిపో ఫోను నంబరు తెలీదంటా!!కుడితిలో పడ్డ ఎలుక లా తయారయింది మా పరిస్థితి!ఎవడో శనిగొట్టుగాడు మా తో పాటు బస్సు ఎక్కడం వల్లే ఇలా అయిందని ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నాము.ఇలాగయిత ఎలాగా మాపరిస్థితి అని ఒక పెద్దాయన గొడవ వేసుకున్నాడు.”మీ పరిస్థితి కి ఏమయ్యిందండీ,నా తప్పు లేకపోయినా ఈ నష్టం అంతా నా జీతంలోనె కట్ చేసి కవరు చేస్తారు” అని ఏడుపు ముఖం పెట్టాడు మా డ్రైవరు!ఏదొ ప్రైవేటు సర్వీసు అయితే ఎలగో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమించమని అడిగెయ్యొచ్చు.ఆర్టీసు వారి కి అంత దయ ఎక్కడ?”అని అన్నాడు వాడు.ఇంతలో ఒక బస్సు అటు వైపు వస్తే దాని ఆపి మమ్మలని అందులో ఎక్కించాడు.అది కూడా డొక్కు పాసింజరు!69 రుపాయలు పెట్టి నాన్స్టాపు టికెట్ తీసుకుని,డొక్కు పాసింజరు లో వెళ్ళవలిసి వచ్చింది.అదే మేము పాసింజరు బస్సులో వుండి దానికి ఏదయినా రిపైరు వస్తే నాన్స్టాప్ బస్సు ఆపుతాడా?
అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్టు సంస్థ లా పని చేస్తుందా మన ఆర్టిసీ?ఇది ప్రజల సౌలభ్యం కోసం నడుపుతున్నారా?లేక లాభ ఆపేక్ష కోసమా?ప్రజలనే కాదు,వారి సిబ్బంది కూడా ఈ డబ్బు పిశాచి లాంటి సంస్థ,దాని వెనక తోడ్పాటు అందివ్వని ప్రభుత్వం కి బలి అయ్యిపోతున్నారు.వైజాగు లో బస్సు చార్జీల కంటే ఆటో చార్జీలు చాలా తక్కువ!విధ్య,వైధ్యం మరియు రవాణా కనీస అవసరాలు కావా?ప్రభుత్వం నడిపే స్కూల్లు,ఆసుపత్రులు నష్టాల్లో వున్నాయని మూసేస్తారా?కనీసం సిబ్బంది కి కూడా జీతాలు సమకూర్చుకోలేవు కదా ఆ స్కూల్లు,ఆసుపత్రులు?అంతర్వాహిణి రవిచంద్ర గారు తమ కామెంట్ లో బిజీ వేళలో బస్సులు తక్కువని వాపోయారు.కరక్టే!కాని నేను అనేదేమంటే,రాష్ట్రం లో రోజుకి ఒక బస్సు అది కూడా ఒక్కసారే తిరిగే వూళ్ళెన్నో?మన దేశం లో అయితే అసలు బస్సు సర్వీసు లేని ప్రాంతాలు ఎన్నో కదా?అలాంటి చోట ఏ మెడికల్ ఎమర్జన్సి అయినా కేవలం రవాణా సదుపాయం లేక ఎన్ని ప్రాణాలు పోతాయో కదా?మన ప్రభుత్వాలకి ఏమి భాద్యత వుండదూ?